డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

Apr 24 2025 12:38 AM | Updated on Apr 24 2025 12:38 AM

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి

ప్రొద్దుటూరు రూరల్‌: ప్రొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, ప్రధానమైన డ్రైనేజీ కాలువల సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపుతామని కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపా రు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ సభాభవనంలో బుధవారం ఆయన నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు నుంచి మురికి నీరు వెళ్లే కాలువల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. ఆక్రమణల తొలగింపులో ఎవరైనా పేదలు నష్టపోతే వారికి ఇళ్లస్థలాలను మంజూరు చేయా లని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధి నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన మడూరు కాలువ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కాలువల ఆధునీకరణకు నిధులు లేకపోతే విడతల వారిగా పూర్తి చేయలని సూచించారు. కూరగాయల మార్కెట్‌ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకు సంబంధించిన గతంలో మంజూరైన నిధులు, ప్రస్తుతం అవసరమైన నిధుల ప్రతిపాదనలు తెలపాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతి కట్టడానికి బిల్డింగ్‌ పర్మిషన్‌ తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. హౌసింగ్‌ పథకం కింద పేదలకు మంజూరైన ఇళ్లు, టిడ్కో గృహసముదాయాల పరిస్థితిపై కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. వాణిజ్యపరంగా పేరున్న ప్రొద్దుటూరులో గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలను, గంజాయి అమ్మకాలను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పారదర్శకంగా పనిచేయాలన్నారు. అటవీ భూములు, పెన్నా ఏటి పోరాంబోకు స్థలాల్లో నిర్మించిన అక్రమ భవనాలపై త్వరలో ప్రభుత్వ ద్వారా ఒక కమిటీ వేస్తామన్నారు. ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్‌ గంగయ్య పాల్గొన్నారు.

కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement