
వక్ఫ్ చట్టం రాకముందే కార్పొరేట్లకు లీజులు
కడప సెవెన్రోడ్స్ : వక్ఫ్ బిల్లు చట్టంగా రాకముందే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఆస్తులను 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టే యత్నాలు చేస్తోందని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సుభాన్ విమర్శించారు. సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి జి.చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధార్మిక బోర్డులలో పరమతస్తులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జస్టిస్ సచార్ కమిటీ ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల రక్షణకు చేసిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. దస్తావేజులు లేవని బై యూజర్ పేరిట వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం తగదన్నారు. బిల్లు చట్టంగా మారకమునుపే 52 బడా కార్పొరేట్ సంస్థలకు ప్రధాన నగరాల్లోని విలువైన ఆస్తులను అప్పగించాలని కేంద్రం చూస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కన్వీనర్ డబ్ల్యు రాము, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా అధ్యక్షుడు ఓబయ్య, ఏపీ దళిత మిత్ర సంఘం అధ్యక్షుడు కై పు రామాంజనేయులు, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు పఠాన్ చాంద్బాషా, లోక్సత్తా నాయకుడు దేవర శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.