కనగల్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం కనగల్, చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలకు చెందిన 30 మంది పాత నేరస్తులను పోలీసులు బైండోవర్ చేశారు. తొలుత కనగల్ పోలీస్ స్టేషన్లో చండూరు సీఐ రాము వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలన్నారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్ల ఎదుట పాత నేరస్తులను బైండవర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కె. రాజీవ్రెడ్డి, శివకుమార్, శోభన్బాబు పాల్గొన్నారు.


