కోదాడ : మూడేళ్లుగా వందల సంఖ్య విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచుతూ వినూత్న కార్యక్రమాల ద్వారా కోదాడ ప్రభుత్వ బాలుర పాఠశాలను అగ్రస్థానంలో నిలిపిన ప్రధానోపాధ్యాయుడు, కోదాడ మండల ఇన్చార్జి ఎంఈఓ సలీంషరీఫ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి అవార్డు వరించింది. 1996 డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన సలీంషరీఫ్ 1998లో మేళ్లచెరువు మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు. 2014–2024 వరకు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు ఇన్చార్జి ఎంఈఓగా పనిచేశారు. 2023 నుంచి కోదాడ బాలుర పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గడిచిన మూడేళ్లుగా 500 దాటించి స్కూల్ను టెన్త్ ఉత్తీర్ణతలోనూ అగ్రస్థానంలో నిలిపారు.
అధ్యాపకులకు అవార్డులు


