ఈహెచ్ఎస్ లో ఉన్న లోపాలను తొలగించాలి.ఉద్యోగులు సమర్పించిన మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఈహెచ్ఎస్ సమర్థంగా అమలు చేయాలి. ఇందుకోసం అవసరమైన మార్గ దర్శకాలు, సౌకర్యాలుకల్పించాలి.
– జగన్మోహన్ ప్రసాద్, టీజీఏ జిల్లా అధ్యక్షుడు
కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావొ స్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, తక్షణమే చొరవ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.
– ప్రియాంక, రెవెన్యూ అసోసియేషన్ మహిళా ప్రతినిధి


