యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో బోనాల పండుగ కావడంతో యాదగిరీశుడి సన్నిధికి భక్తుల రాక తగ్గింది. దీంతో ధర్మ దర్శనానికి 30 నిమిషాలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. స్వామివారిని 25వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువ కనిపించినా, మధ్యాహ్నం తర్వాత సాధారణంగానే ఉంది. వివిధ పూజల ద్వారా నిత్యాదాయం రూ.32,08,855 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
లష్కర్ బోనాల నేపథ్యంలో
యాదగిరిగుట్టకు తగ్గిన భక్తులు


