భువనగిరి : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రిన్స్చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ర్యాలీలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు చింతల శివ, పట్టణ అధ్యక్షుడు నేహల్, నాయకులు జీవన్, సాయి, ప్రసాద్, స్నేహ, శరత్, మధన్, ప్రసన్న శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు.


