సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతడికి రెండు రోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
హుజూర్నగర్ : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన గండు సతీష్ సోమవారం ద్విచక్ర వాహనంపై హుజూర్నగర్ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తుండగా.. గోపాలపురం వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ తలకు గాయాలయ్యాయి. స్ధానికులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. సతీష్ ఎస్బీఐ లైఫ్ ఇన్యూరెన్స్లో పనిచేస్తున్నాడు.


