పాఠశాలల్లో బోధనను పటిష్టం చేసి విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం. విద్యాశాఖ నిర్ణయం ప్రకారం గతేడాది పనిచేసిన ప్యానెల్ తనిఖీ బృందాలనే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాం.
– భిక్షపతి, జిల్లా విద్యాశాఖాధికారి
ప్యానెల్ తనిఖీ సభ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాం. వారి పరిశీలన ఆధారంగా ఏయే పాఠశాలల్లో విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, దానికి తగినట్లుగా ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు అందిస్తారు.
– జానీ అఫ్గన్, అకడమిక్ మానిటరింగ్ అధికారి


