త్వరలో ప్రారంభంకానున్న దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 32వ ఎన్సీఎస్సీ కార్యక్రమంలో జిల్లా నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా హెచ్ఎం, టీచర్లు చొరవ చూపాలి. విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలను అర్థం చేసుకొని ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించడం వల్ల భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఎన్సీఎస్సీ గొప్ప వేదిక. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. టీచర్లు,తల్లిదండ్రులు తమ పిల్లల్లోని శాస్త్రవిజ్ఞానాన్ని ప్రోత్సహించాలి.
–బొల్లారం భిక్షపతి, జిల్లా విద్యాధికారి


