
యాదగిరీశుడికి సువర్ణ పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు అర్చకులు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. గురువారం ఉదయాన్నే క్షేత్రాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేపట్టారు. ఇక ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలు చేసి హారతినిస్తున్న అర్చకుడు