
పహల్గాం మృతులకు నివాళి
యాదగిరిగుట్ట: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన పర్యాటకుల ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో గా యపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.