నల్లగొండ: లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నల్లగొండ జిల్లాకు నియమితులైన కళ్యాణ్కుమార్దాస్ శుక్రవారం నల్లగొండలోని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారు లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, వివిధ రకాల ఫారాలు, డిపాజిట్ తదితర అంశాలపై చర్చించారు. వారివెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment