ఆకట్టుకున్న నృత్యోత్సవాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక వైఎంహెచ్ఏ హాల్ లో అభినయ నృత్యభారతి సంస్థ 30వ వార్షిక జా తీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్య పోటీలు రెండో రోజు శనివారం ఆకట్టుకున్నాయి. టి.కావ్యారా వు (హైదరాబాద్) భరతనాట్యం, నిధికా లూంభా (బెంగళూరు) కథక్, వైష్ణవి మార్గం (వరంగల్) కూచిపూడి, రామ కౌండిన్య శ్రీభాష్యం (శ్రీకాకుళం)కూచిపూడి, ఛార్మిళా వెంకట్ (హైదరాబాద్) కూచిపూడి నృత్యాలతో అలరించారు. వీరందరికీ సంస్థ నిర్వాహకులు నృత్యకౌముది పురస్కారాలు అందించి సత్కరించారు. వీరితో పాటు సేవామూర్తులు ఆ లపాటి నాగేశ్వరరావు (మానవత సేవలు), బీవీ రమణ మూర్తి (విద్యారంగం), ఎంఎస్ చౌదరి (సినీ, నాటక రంగం), కమ్ముల ఆదినారాయణ (యోగా గురువు), పిలగల కొండలరావు (ప్రభుత్వసేవలు), లయన్ చిల్లపల్లి రామమోహనరావు (లయనిజం), ఎస్ఎం ఖాసీం ( సంగీతం), సాలా భోగేశ్వరరావు (సామాజిక సేవ), సాతుపాటి శ్యాంబాబు (స్వచ్ఛంద సేవలు)లకు సేవా తపస్వి అవార్డులు అందించినట్టు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేహసుందర్ తెలిపారు.


