దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు

Apr 29 2025 12:34 AM | Updated on Apr 29 2025 12:34 AM

దాడి

దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు

భీమవరం: రెస్టారెంట్‌లోని ఆహారం బాగాలేదని వంటమనిషిపై దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఏఎస్సై నర్సింహస్వామి సోమవారం చెప్పారు. పట్టణంలోని అజయ్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు పట్టణానికే చెందిన సుధీర్‌, మరో అయిదుగురు వెళ్లారు. అక్కడ ఆహారం బాగాలేదని వంట మనిషి ప్రకాష్‌పై బీరుబాటిల్‌ పగులగొట్టి దాడిచేశారు. దీనిపై బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సూపర్‌వైజర్‌ దారపురెడ్డి గణేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నర్సింహస్వామి చెప్పారు.

ట్రిపుల్‌ ఐటీలో మెస్‌లనిర్వహణపై అభిప్రాయ సేకరణ

నూజివీడు: ట్రిపుల్‌ఐ టీలోని మెస్‌ల నిర్వహణపై సోమవారం అధికారులు విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. తహసీల్దార్‌ బీవీ సుబ్బారావు తన సిబ్బందితో వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెస్‌లలో భోజనం ఎలా ఉంది, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌లలో శుభ్రత తదితర విషయాలపై అభిప్రాయాన్ని తెలపమని విద్యార్థులకు ప్రింటెండ్‌ పత్రాలు అందించారు. వాటిల్లో విద్యార్థులు వారి అభిప్రాయాన్ని తెలిపారు. అభిప్రాయ సేకరణను సబ్‌ కలెక్టర్‌ బచ్చు స్మరణ్‌రాజ్‌ పరిశీలించారు. భోజనం ఎలా ఉందంటూ పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పెట్టే భోజనం శుచిగా, రుచిగా ఉండాలన్నారు. ట్రిపుల్‌ ఐటీ అధికారులు నిరంతరం మెస్‌లను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.

కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు

ముదినేపల్లి రూరల్‌: మండలంలోని పేరూరులో స్థానిక సమస్యలపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దళితులను కులం పేరుతో దూషించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగజగన్‌బాబురావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన మురళీ, అతని తల్లి ఆ గ్రామంలోని సమస్యలకు సంబంధించి దళితులకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ పెద్దల సమక్షంలో దళితులను కులం పేరుతో దూషించి కించపరిచారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినవారిలో దళిత నాయకులు గరికిముక్కుల రాజేష్‌, భూపతి సునీత, తదితరులున్నారు.

మ్యాజిక్‌ ఫెస్టివల్‌లో మెరిసిన లేడీ మెజీషియన్‌ లక్ష్మీప్రసన్న

తణుకు అర్బన్‌: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈనెల 27వ తేదీన నిర్వహించిన పల్నాడు మ్యాజిక్‌ ఫెస్టివల్‌లో తణుకుకు చెందిన లేడీ మెజీషియన్‌ దండా లక్ష్మీప్రసన్న తృతీయ స్థానంలో నిలిచారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా హాజరైన ఈ ఫెస్టివల్‌లో తృతీయ స్థానంలో నిలవడం చాలా సంతృప్తినిచ్చిందని ప్రసన్న తెలిపారు. ఈ ఫెస్టివల్‌తో వరుసగా మూడేళ్లపాటు మెజీషియన్‌ ఫెస్టివల్స్‌లో విజయం సాధించి హాట్రిక్‌గా నిలిచినట్లు వివరించారు. 2023లో అమరావతి జరిగిన మ్యాజిక్‌ ఫెస్టివల్‌లో స్టేట్‌ ఫస్ట్‌గాను, 2024లో ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా తాజ్‌ మ్యాజిక్‌ ఫెస్టివల్‌లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఫెస్టివల్‌ నిర్వాహకులు జీవీఆర్‌, పల్నాడు ఫెస్టివల్‌ అధ్యక్షుడు బాబునాయుడు, కార్యదర్శి నాగరాజు, గురువు దండా రాములకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు 1
1/1

దాడి కేసులో ఆరుగురిపై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement