
ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం
సాక్షి, భీమవరం: జిల్లాలోని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య గ్రహణం పట్టింది. నిధులు లేక నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. రెండేళ్లలో పూర్తికాల్సిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. మరో పక్క ఆక్వా వర్సిటీని ప్రైవేట్పరం చేసే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆక్వా హబ్గా ఉమ్మడి జిల్లా..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 2.53 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు, 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలు, ఆక్వా అనుబంధ వ్యాపారాలతో ఆక్వా హబ్గా పేరొందింది. చేపలు, రొయ్యల మేతలు, చెరువుల నిర్వహణ సామగ్రి అమ్మకాలు, పట్టుబడి, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రవాణా తదితర రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వే లాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ఆక్వాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో గత సీఎం జగన్మోహన్రెడ్డి ఆక్వా యూనివర్సిటీని మంజూరు చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం, జిల్లాలోని ఉండిలోని ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్లను యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చారు. యూనివర్సిటీ కోసం నరసాపురం సమీపంలోని లిఖితపూడిలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవన నిర్మాణాల నిమిత్తం రూ.100 కోట్లు మంజూరు చేశారు. తాత్కాలికంగా నరసాపురంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో 2022 నవంబరు నుంచి 66 సీట్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తరగతులను ప్రారంభించారు. గతే డాది నూతన భవనాల్లో ఆక్వా వర్సిటీ, క్యాంపస్ కళాశాలను ప్రారంభించే లక్ష్యంతో అప్పట్లో పనులు వేగవంతం చేశారు.
ఆర్బీకేలో సెకండ్ బ్యాచ్కు తరగతులు
నరసాపురంలోని 12 గదులతో ఉన్న తుఫాను షె ల్టర్ భవనంలో తాత్కాలికంగా కళాశాలను నిర్వహి స్తున్నారు. తరగతి గదులు, ల్యాబ్, ఆఫీస్, లైబర్రీ, స్టాఫ్ రూమ్ ప్రస్తుతం ఉన్న భవనం ఒక బ్యాచ్కు మాత్రమే సరిపోతుంది. గతేడాది సెకెండ్ బ్యాచ్కు క్లాసులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న భవనం సరిపోక ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలోని ఫిషరీస్కు సంబంధించిన భవనాల్లోకి కళాశాలను తరలించాలని అధికారులు భావించారు. స్థానికంగా వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఆ ప్రయత్నాన్ని నిలిపివేసినట్టు సమాచారం. దీంతో రైతు భరోసా కేంద్రాన్ని తరగతుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరితగతిన యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష ్యంతోనే..
ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందేందుకు ఆక్వా వర్సిటీ దోహదపడుతుంది. ప్రైవేట్ సంస్థలకు ఆక్వా వర్సిటీని అప్పగించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పేద విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి ఆలోచన ఏమైనా ఉంటే విరమించుకుని త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి.
– వడ్డి రఘురాం,
అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం
విద్యపై కూటమి కత్తి
గత ప్రభుత్వంలో జిల్లాకు తలమానికంగా ఆక్వా వర్సిటీ
భవన నిర్మాణాలకు రూ.100 కోట్ల మంజూరు
రెండేళ్లలో పనులు పూర్తిచేసేలా లక్ష్యం
బిల్లుల విడుదలలో కూటమి సర్కారు జాప్యం
ఏడాదిగా నత్తనడకన పనులు
ప్రైవేట్పరం చేసే ఆలోచన ?
ముందుకు సాగని పనులు
అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాల పనులు శ్లాబ్ దశకు చేరుకోగా బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.35 కోట్ల విలువైన పనులు జరగ్గా కేవలం రూ.15 కోట్లు మాత్రమే బిల్లులు విడుదలయ్యాయి. తాజా బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఆక్వా వర్సిటీకి కేటాయించడంతో ఈ ఏడాది పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది చెప్పలేమని అధికార, నిర్మాణ సంస్థ వర్గాలంటున్నాయి. ఆక్వా వర్సిటీని ప్రైవేట్పరం చేసే ఆలోచనతోనే ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే గత ప్రభుత్వం ఉన్నతాశయంతో తలపెట్టిన ఈ కార్యక్రమం నీరుగారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం

ఆక్వా వర్సిటీకి చంద్ర గ్రహణం