పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడు | - | Sakshi
Sakshi News home page

పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడు

Apr 20 2023 11:28 AM | Updated on Apr 20 2023 11:29 AM

శివనారాయణపురంలోని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న యువతి  - Sakshi

శివనారాయణపురంలోని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న యువతి

మొగల్తూరు: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు బాధిత యువతి బుధవారం మౌనపోరాటానికి దిగింది. బాధిత యువతి మాట్లాడుతూ శ్రీరాంపురం పంచాయతీ శివనారాయణపురానికి చెందిన కొండేటి సాయి తాను నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామన్నారు. తనను వివాహం చేసుకోవాలని కోరగా తాను అగ్ర కులానికి చెందిన వాడినిని తమ ఇంట్లో పెళ్ళికి అంగీకరించరని నిరాకరించాడని తెలిపింది.

తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని తెలిపింది. ఆమె పోరాటానికి మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెన్నేటి కిశోర్‌లు మాట్లాడుతూ దళిత బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై రూరల్‌ సీఐ సురేష్‌ బాబు బుధవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాట్లు చేశారు. యువతి తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదని, అన్యాయం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement