పర్వతగిరి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎస్ఈ వెంకటరమణ, ఆపరేషన్స్ సూపరింటెండెంట్ ఆనంద్లు అన్నారు. సోమవారం మండలంలోని ఏనుగల్ గ్రామంలో బోయినపల్లి మురళీధర్రావుకు చెందిన 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరంతర విద్యుత్ అందిస్తామన్నారు. ప్రక్రియ విజయవంతం కావడంతో ప్లాంట్ నుంచి గ్రిడ్కు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ తిరుపతి, డీఈలు ధానయ్య, హర్జానాయక్, ఏఈ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


