
భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా శేషు మాట్లాడుతూ.. పవిత్రోత్సవంతో ఆలయం, సకలజనులకు పవిత్రత చేకూరుతుందన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: రక్షాబంధన్, హయగ్రీవ జయంతి వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ నగరంలోని ఆలయాల్లో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి రాఖీతో అలంకరించారు. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ వికాస్నగర్లోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో నిర్వాహకుడు ఆరుట్ల శ్రీనివాసాచా ర్యస్వామి హయగ్రీవ స్తోత్రపారాయణం, అర్చన నిర్వహించారు.

భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం