
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో స్కానింగ్ సెంటర్లు ఉన్న అన్ని ఆస్పత్రులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా.. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, అబార్షన్లు నిర్వహించే వారి సమాచారాన్ని తెలి యజేసేందుకు సంబంధిత ఫోన్ నంబర్ 63000 30940 ను క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ప్రతీ ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. లీగల్ వలంటీర్ల ద్వారా లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, వైద్య ఆరోగ్య శాఖకు సహకరిస్తామని తెలిపారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 8 సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, ఏసీపీ నరసింహారావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మల్లయ్య, బన్ను ఆరోగ్య సేవల సొసైటీ ప్రతినిధి నీతి, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మంజుల, డెమో అశోక్రెడ్డి, గణాంక అధికారి ప్రసన్నకుమార్, కళ్యాణి, పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హెల్త్చెకప్
విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో విద్యా, సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఓపెన్ స్కూ ల్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల పోస్టర్లు ఆవిష్కరించారు.
ఇళ్ల పనులు ఇంకెన్నాళ్లు?
హసన్పర్తి: ఆరునెలల క్రితం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు? ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు? అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశ్నించారు. హసన్పర్తి మండలం పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ సిద్ధార్థనాయక్ తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ రవి, ఎంపీఓ కర్ణాకర్రెడ్డి, ఏఈ సరిత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం ఆమె ఎల్కతుర్తి పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ రిజిస్టర్, ఈ–ఔషధీ ఇండెంట్, రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. అనంతరం ఆశా డే సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వందశాతం ప్రసవాలు జరిగేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధి కారి శ్రీనాఽథ్, హెల్త్ సూపర్వైజర్ రామచంద్ర, నో డల్ పర్సన్ ఎండీ శుక్ర, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితర సిబ్బంది ఉన్నారు. అనంతరం ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో పై లట్ ప్రాజెక్టు కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులు పరిశీలించారు. ఆమె వెంట గృహ ని ర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థనాయక్, తహసీ ల్దార్ ప్రసాద్రావు, ఎంపీఓ రవి ఉన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్