ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన

Dec 26 2025 8:11 AM | Updated on Dec 26 2025 10:20 AM

ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన

ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన

వనపర్తి రూరల్‌: మండలంలోని అంకూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సేకరించిన వరి ధాన్యాన్ని వెంటనే తరలించాలంటూ రైతులు గురువారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి ధాన్యం కేంద్రంలో రెండు నెలలుగా ఆరబోసుకున్నామని, తూకం చేసిన సంచులను తరలించకపోవడంతో వరాహాల దాడి ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 లారీల ధాన్యం కేంద్రంలో నిల్వ ఉందని.. వెంటనే తరలించాలని వారు కోరారు. ఆందోళనతో రహదారిపై రాకపోకలు నలిచి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని అధికారులు, రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement