
కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట
వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన తిరుమలనాఽథ వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయగా, గుట్ట కింద దాతలు అన్నప్రసాద వితరణ చేపట్టారు. శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీగా తరలిరావడంతో గుట్టపైకి వెళ్లడానికి ఘాట్ రోడ్లో ఇరువైపులా వాహనాల రద్దీ ఏర్పడి రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి సిబ్బందితో చేరుకొని రాకపోకలను పునరుద్ధరించడంతో పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గస్తీ నిర్వహించారు. గుట్టపైన భక్తులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
గుట్టపై భక్తుల రద్దీ