
త్వరగా ఖాతాలు ఇవ్వాలి..
త్రిఫ్ట్ ఫండ్ కోసం విచారించి ఎంపిక చేశారు. అధికారుల సూచన మేరకు బ్యాంకులో ఆర్డీ–1, 2 ఖాతాలు తెరిచేందుకు అమరచింత యూనియన్ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాం. కానీ, అధికారులు ఇప్పటి వరకు ఖాతాలు తెరిచి ఇవ్వడం లేదు. విషయాన్ని జౌళీ శాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.
– నాగరాజు, నేత కార్మికుడు, అమరచింత
వాటాధనం పెంచడం
సంతోషం..
నేతన్నకు పొదుపు పథకం ద్వారా మగ్గానికి ఇద్దరే అంటూ ఎంపిక చేశారు. వీటితోపాటు గతంలో చెల్లించే వాటా ధనం కంటే అధికంగా చెల్లించాలని చెప్పారు. ప్రధాన కార్మికుడు రూ.1,200, అనుబంధ కార్మికుడికి రూ.800 చెల్లించాలని నిర్ణయించడం సంతోషంగా ఉంది. దీంతో తాము చెల్లించే వాటా ధనంకు రెండింతలు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది.
– గంజి కృష్ణయ్య,
నేత కార్మికుడు, అమరచింత
పారదర్శకంగా సర్వే..
నేతన్నకు పొదుపు పథకం కోసం మగ్గానికి ఇద్దరినే ఎంపిక చేయాలన్న ప్రభు త్వ ఆదేశాలతో పూర్తిస్థాయి లో పారదర్శకంగా సర్వే చేపట్టి లబ్ధిదారులను ఖరారు చేశాం. ప్రస్తు తం 600 మంది మాత్రమే వీటికి అర్హులుగా గుర్తించాం. అనుబంధ కార్మికుల గురించి ఇంకా ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదు. బ్యాంకు ఖాతాల ప్రక్రియ 78 శాతం పూర్తయింది. త్వరగా నేతన్నల ఖాతాలో వాటాధనం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – గోవిందయ్య, జౌళిశాఖ ఏడీ
●

త్వరగా ఖాతాలు ఇవ్వాలి..

త్వరగా ఖాతాలు ఇవ్వాలి..