ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌

Apr 12 2025 2:11 AM | Updated on Apr 12 2025 2:11 AM

ఉపాధ్యాయురాలి  సస్పెన్షన్‌

ఉపాధ్యాయురాలి సస్పెన్షన్‌

ఖిల్లాఘనపురం: మండలంలోని మల్క్‌మియాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయురాలు పి.భారతమ్మను సస్పెండ్‌ చేసినట్లు మండల విద్యాధికారి జయశంకర్‌ తెలిపారు. సమయపాలన పాటించకపోవడం, విద్యార్థులకు అకాడమిక్‌ సైడ్‌ రిజిస్టర్లు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ నోటీస్‌ రిజిస్టర్‌, ఎండీఎం రిజిస్టర్‌, వర్క్‌బుక్‌ నిర్వహణ, అడ్మిషన్‌ రిజిస్టర్ల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంతో పాటు ప్రభుత్వం నుంచ్చి వచ్చే నిధుల వినియోగంలో అవకతవకలు ఉన్నాయన్నారు. ఈ విషయమై 4వ తేదీన జిల్లా విద్యాధికారి అబ్దుల్‌ ఘని పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించడంతో పాటు నిధుల వినియోగంపై ఆరా తీశారని చెప్పారు. ఆయన సూచనల మేరకు శుక్రవారం ఉపాధ్యాయురాలిని సస్పెండ్‌ చేసినట్లు ఎంఈఓ వివరించారు.

రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 285 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్‌ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 67 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

పాలెం డిగ్రీ కళాశాలలో సమూల మార్పులు

బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల (అటానమస్‌)లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అకాడమిక్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ సభ్యులు, యూనివర్సిటీ అకాడమిక్‌ డీన్‌లు, ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు, ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరై అకాడమిక్‌ క్యాలెండర్‌ రూపకల్పన, సిలబస్‌ను అభివృద్ధి చేశారు. అంతేకాక పాఠ్యాంశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం, సవరించడం, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష ఫీజుల నిర్ణయం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, మాడరేషన్‌, డిటెండ్‌ నియమాలు, వివిధ ప్రోగ్రాంల వివరణ, విద్యా సంబంధిత నిబంధనలు, ఇతర మార్గ దర్శకాలను రూపొందించారు. సమావేశంలో ప్రొఫెసర్లు చెన్నప్ప, జయపాల్‌రెడ్డి, పాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ రాములు, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ పద్మావతి, పెబ్బేరు కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటప్రసాద్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్లు పద్మజ, శ్రీనివాసులు, నాగరాజు, సుష్మ, శివ, బోర్డు ఆఫ్‌ సబ్జెక్టు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement