‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌’

Apr 9 2025 12:46 AM | Updated on Apr 9 2025 12:46 AM

‘ప్రజ

‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌’

వనపర్తిటౌన్‌: రాష్ట్రంలో అమలుకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 12, 25 వార్డులో పార్టీ ఆవిర్భావ వేడుకలు పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని చెప్పారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని.. ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పుర ఎన్నికల్లో కష్టపడి పనిచేసి అత్యధిక కౌన్సిలర్లను గెలిపించుకొని చైర్మన్‌ పదవిని సాధించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బాలరాజు, పద్మక్క, పెద్దపులి కిరణ్‌, ప్రధాన కార్యదర్శులు నవీన్‌, అరవింద్‌, ఉపాధ్యక్షుడు ఉపేందర్‌ యాదవ్‌, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రవినాయుడు, నాయకులు చాణక్య, శివ, పవన్‌, కార్తీక్‌, చందు, విజయ్‌, సంజీవ్‌, రాజు, మన్నెం, గణేష్‌, రాములు, నాగరాజు, శివ, నవీన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌’ 1
1/1

‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement