పోర్టల్‌లో నమోదు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పోర్టల్‌లో నమోదు తప్పనిసరి

Aug 22 2025 6:55 AM | Updated on Aug 22 2025 6:55 AM

పోర్టల్‌లో నమోదు తప్పనిసరి

పోర్టల్‌లో నమోదు తప్పనిసరి

పోర్టల్‌లో నమోదు తప్పనిసరి

పార్వతీపురం టౌన్‌: జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ నోడల్‌ ఉపాధ్యాయుల ద్వారా మైజీఓవీ.ఐన్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని టీఓఎఫ్‌ఈఐ జిల్లా నోడల్‌ అధికారి చొక్కాపు శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని జెడ్‌పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పొగాకు వాడకం లేని కార్యక్రమాలుగా పోస్టర్‌ ప్రదర్శనలు, వీధి నాటకాలు, నినాదాల ప్రదర్శనలు, ర్యాలీలు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వాటి వీడియోలు, ఫొటోలను వెబ్‌సైట్‌లో ఈ నెల 31 లోపు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు అమలు కావాలని స్పష్టం చేశారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 50 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హేమసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement