
ఎవరు చేశారీ పని?
● కలెక్టరేట్ పేరుతో ఉన్న అక్షరాలను తొలగించే ప్రయత్నం
పార్వతీపురం రూరల్: కలెక్టరేట్ ముఖద్వారం వద్ద ఉన్న బోర్డులో కలెక్టర్ కార్యాలయం అని సూచించే పదాల అచ్చులను గుర్తుతెలియని అకతాయిలు బుధవారం రాత్రి తొలగించారు. ఈ క్రమంలో కొన్ని పదాలకు సంబంధించిన అక్షరాలు బోర్డులో గురువారం ఉదయం లేకపోవడాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ మేరకు డీఆర్ఓ కె.హేమలత, ఈ చర్యలను తీవ్రంగా పరిగణించి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు చేయాలని కోరారు. ఈ మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా, సీఐ కె.మురళీధర్ పరిశీలించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అత్తారింటి వేధింపులపై
కేసు నమోదు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని కొత్తవలసలో ఉన్న విజయరామరాజు కాలనీకి చెందిన ఓ వివాహిత భర్తతో పాటు అత్తమామలపై వేధింపుల కేసు పెట్టింది. నిత్యం తనను వేధిస్తూ అధిక కట్నం కోసం డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై గోవింద తెలిపారు.