
ఏకగ్రీవంగా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నిక
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరా జ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ (ఏపీపీఆర్ఎంఈఏ) జిల్లా శాఖ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో శనివారం జరిగిన ఎన్నికల్లో నూత న కమిటీని ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా సీహెచ్ మురళి, ప్రధాన కార్యదర్శిగా పి.ఎం.రవికుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా బి.వి.నాగభూ షణరావు, ఉపాధ్యక్షుడిగా టి.ప్రవీణ్కుమార్, కోశాధికారిగా వి.రాంబాబు, జాయింట్ సెక్రటరీగా ఎల్.వి.ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.రాజ్ కుమార్, ఎం.నారాయణరావు, డి.లత, డీహెచ్వీఆర్ ప్రభాకర్, బి.లక్ష్మణ్కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్.అర్జునరావు, వి.ఎ.వర్మ, ఎ.రమణమూర్తి, కె.వి.శ్రీనివాసరావు, జేసీసీ మెంబర్గా బి.వి.గోవిందరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విజయనగరం జిల్లా ఏపీఎన్జీజీఓ అధ్యక్షుడు టి.శ్రీధర్బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా పట్టణ ఏపీఎన్జీఓ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.గోపాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులుగా విశాఖ జిల్లా సంఘం అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ఎంకేజీ ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి.వి.రమేష్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బండి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గంటా వెంకటరావు, ఆర్.వి.రమణమూర్తి, ఏపీఎన్జీజీఓ జిల్లా కార్యదర్శి ఎ.సురేష్, జిల్లా, తాలూకా యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు.