అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి

Apr 22 2025 1:02 AM | Updated on Apr 22 2025 1:02 AM

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి

కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌

పీజీఆర్‌ఎస్‌కు 147 వినతులు

పార్వతీపురం టౌన్‌: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులు సొంత సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేయాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 147 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావివ్వద్దన్నారు. పరిష్కారమయ్యే సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని పునఃప్రారంభం కారాదని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోభిక, డీఆర్‌ఓ హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అర్జీలలో కొన్ని ఇలా..

● 25 కుటుంబాల నివాసం ఉండే గుమ్మలక్ష్మీపురం మండలం కొండబిన్నిడి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆ గ్రామానికి చెందిన గిరిజనులు వినతిని అందజేశారు.

● కురుపాం మండలం పెద్దగొత్తిలిలో సచివాలయం, రైతు భరోసా కేంద్ర నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రస్తుతం పాత పంచాయతీ భవనం పాడవ్వడంతో వర్షం నీరు కారుతుందని, పరిపాలనకు ఆటంకం కలుగుతుందని, నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్‌ పి.టి.లోకనాధం వినతిని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement