రెండు రోజులకు ఒకసారి మాత్రమే కుళాయి నీరు వస్తోంది. భూగర్భ జలాలు ఎండిపోవడంతో చేతి బోర్లు, సొంత బోర్లు పనిచేయడం లేదని.. తాగునీటి కోసం బయట క్యాన్లు కొనాల్సి వస్తోంది.
– దాసరి రజని, లక్ష్మీనగర్
ఎలక్షన్ వస్తే చెబుతాం..
మధురవాడ కార్పెంటర్స్ కాలనీ కొండపైకి జీవీఎంసీ నీరు రావడం లేదు. కింద నుంచి బిందెలతో నీరు మోసుకెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. తాగునీటికి ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. స్థానిక ఎన్నికలు వస్తే అప్పుడు చెబుతాం. – మహాదేవ విజయ,
కార్పెంటర్స్ కాలనీ, మధురవాడ


