ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి
రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, టీడీపీ చేసే రాజకీయ కుయుక్తులు, ప్రలోభాలతోపాటు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులపై చేసే ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, అవసరమైతే న్యాయపరంగానూ పోరాడాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టంగా పూర్తి చేయడంతోపాటు ప్రతి నాయకుడు, కార్యకర్త వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి నమోదు చేయాలని చెప్పారు. ఫొటో, ఓటర్ కార్డు తదితర వివరాలతో పారదర్శకమైన పార్టీ డేటాను రూపొందించాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ బాధ్యతలు, కార్యక్రమాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటేనే రాజకీయ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమన్నారు.


