జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న స్పష్టత వచ్చిందని దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ అన్నారు. అందుకే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందజేస్తున్న వినతులపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించి.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.


