కూటమిలో ఇప్పటికే కుమ్ములాటలు మొదలయ్యాయని, స్థానిక ఎన్నికల్లో వారి మధ్య జరిగే పోరు వైఎస్సార్ సీపీకి లాభం చేకూరుస్తుందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద నగరమైన విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం లేకుండా పోయిందని, నగరవాసులు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం పనిచేసే ఏకై క పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.


