సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ధర కంటే వేల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నా సివిల్ సప్లయ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు సిబ్బంది ఈ అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వ్యాపారం కొనసాగించడానికి తప్పని పరిస్థితుల్లో హోటల్ యజమానులు అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా హోటల్ ఖర్చులు పెరిగి ఆ భారం చివరికి వినియోగదారులపై పడుతోంది. ఇప్పటికే కొన్ని హోటళ్లలో తినుబండారాల ధరలు పెంచడం ప్రారంభించారు.


