స్థానిక నేతలది ప్రేక్షకపాత్రే | - | Sakshi
Sakshi News home page

స్థానిక నేతలది ప్రేక్షకపాత్రే

Aug 31 2025 7:16 AM | Updated on Aug 31 2025 7:16 AM

స్థానిక నేతలది ప్రేక్షకపాత్రే

స్థానిక నేతలది ప్రేక్షకపాత్రే

● కార్పొరేటర్లు ఓ మూలకే పరిమితం ● 12 వేల అంచనా.. 3 వేలే హాజరు! ముఖం చాటేసిన జనం సభకు 12 వేలకు మందికి పైగా జనం వస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితర నాయకులు మూడు రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. అయితే, వారి అంచనాలు తలకిందులయ్యాయి. అనుకున్నంతగా జనం రాలేదు. దీంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. కేవలం 3 వేల మంది సైనికులు, అభిమానులు మాత్రమే హాజరైనట్లు అంచనా. భారీగా వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమివ్వడంతో పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర నిరాశ నెలకొంది.

జగదాంబ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. భారీ అంచనాల మధ్య జరిగిన ఈ సభకు జనం ముఖం చాటేశారు. సభలో స్థానిక నాయకులను పూర్తిగా విస్మరించడం, పోలీసుల మితిమీరిన ఆంక్షలతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

స్థానిక నేతలకు దక్కని ప్రాధాన్యం

ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శనివారం జరిగిన సేనతో సేనాని కార్యక్రమం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సభలో స్థానిక నాయకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దక్షిణ నియోజకవర్గం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లితో పాటు రాష్ట్రంలోని జనసేన ఎమ్మె ల్యేలు, ఎంపీలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అవుతుందనుకున్న సభ.. ఆరు గంటల వరకు ప్రారంభం కాలేదు. పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత సభాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ మినహా మిగతా వారంతా ప్రేక్షక పాత్ర వహించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఏ ఒక్క స్థానిక నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం ఇతర జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో పొగడ్తలు గుప్పించడంతో స్థానిక నేతలు తెల్లముఖాలు వేశారు. మరో వైపు జనసేన కార్పొరేటర్లను, పార్టీ మారిన వారిని సభా ప్రాంగణంలో ఓ మూలకు కూర్చోబెట్టడం వారిని మరింత ఇబ్బందికి గురిచేసింది. కనీసం నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. కార్యకర్తను నాయకుడిని చేస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.

పోలీసుల ఆంక్షల హంగామా

సేనతో సేనాని కార్యక్రమం కోసం పోలీసులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం స్టేడియం పరిసరాల్లో మోహరించింది. రామకృష్ణ జంక్షన్‌, రైతుబజార్‌, టౌన్‌కొత్తరోడ్డు, దుర్గాలమ్మ జంక్షన్‌, వెలంపేట వంటి కీలక ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి రహదారులను మూసేశారు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వన్‌టౌన్‌ సీఐ జీడీ బాబు చేసిన అత్యుత్సాహం తోటి పోలీసులకే విసుగు తెప్పించింది.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేశారట!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా జనసేన ఆపిందని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. ప్రస్తుతం చాపకిందనీరులా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కార్యక్రమాలు జరుగుతున్నా సభలో నోరెత్తకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక సభా కార్యక్రమం మధ్యలో తమిళ నటుడు విజయ్‌ పెట్టిన పార్టీ జెండాలను పవన్‌ కల్యాణ్‌ వేసుకోవడంతోపాటు అక్కడ నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆ జెండాలను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement