
నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూ క్యాంపస్: వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంధ్య మైరెన్స్ సహకారంతో వైజాగ్ మారథాన్ నాల్గవ ఎడిషన్ నవంబర్ 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సోమవారం బీచ్రోడ్డులోని ఒక హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 32 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్నవారు వైజాగ్ మారథాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ పోటీ లో పాల్గొనే వారందరికీ టీషర్ట్, మెడల్, ఎనర్జీ డ్రింక్, అల్పాహారం అందిస్తామన్నారు. సంధ్య మైరెన్స్ డైరెక్టర్ కె. ఆనంద్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిశోర్, అపోలో హాస్పిటల్స్ సీవోవో శ్రీరామచంద్ర, దుద్దుపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.