నూతన కార్యాలయం ప్రారంభం
కంచరపాలెం(విశాఖ ఉత్తర): వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 గురించి ప్రతి వినియోగదారుడు తెలుసుకోవాలని న్యాయమూర్తి జి.తనూజ అన్నారు. ఐటీఐ జంక్షన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వినియోగదారుల వివాదాల కేస్ ఫైల్ కార్యాలయాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదుల ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి వినియోగదారులు కేస్ ఫైల్ వేయవచ్చని తెలియజేశారు. అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రచార కరపత్రాలు విడుదల చేశారు. ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ మర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్వో జి.సూర్యప్రకాష్, డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ నందాజీ, ఉపాధ్యాయులు దొడ్డి సంజీవకుమార్, జిల్లాలో ఉన్న వినియోగదారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.