కుల్కచర్ల: నిరుపేదలు, బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు తాము అండగా ఉంటామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం ఘనపూర్ గ్రామానికి చెందిన లేగల బచ్చయ్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఘనపూర్ ఇంచార్జి వెంకట్, మండల నాయకులు రాజు, మల్లేశ్, శ్రీనివాస్, చిన్న రాములు, మొగులప్ప, కిష్టయ్య, చంద్రయ్య, దేవేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి


