విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

Aug 24 2025 9:54 AM | Updated on Aug 24 2025 2:04 PM

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

● సిబ్బంది కొరత ఉన్నా పశువైద్యానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ● పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ సదానందం

తాండూరు రూరల్‌: విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ సదానందం హెచ్చరించారు. శనివారం తాండూరులోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్‌ సెంటర్‌ డాక్టర్లు, కాంపౌండర్లు, గోపాలమిత్రలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నా సర్దుబాటు చేసి పశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. 34 డాక్టర్‌ పోస్టులకు గాను 10 ఖాళీగా ఉన్నాయన్నారు. 60 సబ్‌ సెంటర్లలో 35 కాంపౌండర్‌ పోస్టులు భర్తీ కాగా 25 ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. విధులకు సక్రమంగా హాజరుకాని తాండూరు ఇన్‌చార్జ్‌ ఏడీఏపై చర్యలు తీసుకుంటామన్నారు.ఽ ధారూరు మండలం కుక్కింద సబ్‌ సెంటర్‌ కాంపౌండర్‌ను ఏడీఏ కార్యాలయానికి డిప్యూటేషన్‌ వేసినట్లు తెలిపారు. పశువులు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించారు.

జీతాలు ఇప్పించండి సారూ..

ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నామని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ సదానందం కోరారు. జిల్లాలో 56 మంది గోపాలమిత్రలు పని చేస్తున్నారని, ప్రతి నెలా జీతం అందేలా చూడాలని విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement