
ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి
కొడంగల్: నియోజకవర్గంలోని ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం నగరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధిపై చర్చించారు. వీటిని సమూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు. ఆలయ డిజైన్లను అధికారులు సీఎంకు చూపించారు. ప్రాకార మండపం, మాఢవీధులు, భూ వరాహ స్వామి ఆలయం, గర్భగుడి, మహా మండపం డిజైన్లను, దౌల్తాబాద్, కోస్గి ఆలయాల డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్రాజ్, దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావ్, కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశం