చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

Mar 24 2025 7:00 AM | Updated on Mar 24 2025 6:59 AM

పరిగి: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి ఇబ్రాహింపూర్‌ చెరువులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రాహీంపూర్‌ మత్స్యసహకర సంఘం సభ్యుడు రాఘవపురం నర్సింహులు(35), వృత్తి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం చెరువులో చేపలు పట్టేందుకు వల వేయగా.. ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి పోయాడు. పక్కనే ఉన్న మత్స్యకారులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా.. నీటిలో మునిగిపోయాడు. రాత్రి 8గంటల వరకు వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 8గంటలకు శవం పైకి తేలింది. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐసంతోష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement