నాగసమందర్‌లో వన్యప్రాణుల వేట | - | Sakshi
Sakshi News home page

నాగసమందర్‌లో వన్యప్రాణుల వేట

Mar 19 2025 7:56 AM | Updated on Mar 19 2025 7:56 AM

నాగసమందర్‌లో వన్యప్రాణుల వేట

నాగసమందర్‌లో వన్యప్రాణుల వేట

ధారూరు: వన్యప్రాణుల వేటకు వచ్చిన వేటగాళ్ల వాహనాన్ని మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది పట్టుకున్నారు. అధికారుల రాకను గుర్తించిన వేటగాళ్లు వాహనాన్ని వదిలి పారిపోయారు. ధారూరు రేంజర్‌ బి.రాజేందర్‌ తెలిపిన ప్రకారం.. ధారూరు ఫారెస్టు రేంజ్‌ పరిధిలోని నాగసమందర్‌ అటవీప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది గస్తీ తిరుగతున్నారు. వీరికి అడవిలో ఓ వాహనం కనిపించడంతో అదుపులోకి తీసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా గమనించిన వేటగాళ్లు వారికి దొరక్కుండా పారిపోయారు. ఫారెస్టు రేంజర్‌ రాజేందర్‌, సిబ్బంది కేఏ 36 సీ 5587 నంబర్‌ వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో వన్యప్రాణులను వేటాడేందుకు తాడుతో అల్లిన వలల చుట్టలు, తీగలు లభ్యమయ్యాయి. కోట్‌పల్లి మండల సమీపం అన్నాసాగర్‌కు చెందిన ఓ అనుమానిత వ్యక్తిని ఫారెస్టు సిబ్బంది పట్టుకున్నారు. అతనితో పాటు వాహనాన్ని ధా రూరు అటవీశాఖ రేంజ్‌ కార్యాలయానికి తరలించా రు. కాగా ఫారెస్టు అధికారులు పట్టుకున్న వాహనంపై అడవి రాములు అనే అక్షరాలు కనపించాయి.

వేటగాళ్ల వాహనం సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement