పీసీసీ రానందుకు బాధగా ఉంది: ఎంపీ కోమటిరెడ్డి

YSR Birth Anniversary Komati Reddy Pays Tribute To YSR - Sakshi

సాక్షి, యాదాద్రి : తనకు పీసీసీ అధ్యక్ష పదవి రానందుకు బాధగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో జరిగిన వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ చాలా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా పోలేదు. నాకు పార్టీ మారే అవసరం లేదు. నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం లేదు. నాకు ఏ పదవి అవసరం లేదు. గాంధీ భవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం’’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top