Petrol Price: ఎంతకాలం పెంచుతారంటూ కొత్త బైక్‌ను తగులబెట్టాడు | Young Man Burns His New Bike Protest Of Petrol Prices Hike Mahabubnagar | Sakshi
Sakshi News home page

Petrol Price: ఎంతకాలం పెంచుతారంటూ కొత్త బైక్‌ను తగులబెట్టాడు

Aug 26 2021 7:41 AM | Updated on Aug 26 2021 7:46 AM

Young Man Burns His New Bike Protest Of Petrol Prices Hike Mahabubnagar - Sakshi

ధరూరు: పెరిగిన పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ తన కొత్త బైక్‌ను తగలబెట్టాడు ఓ యువకుడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండల కేంద్రానికి చెందిన రైతు కుర్వ ఆంజనేయులు మూడు నెలల క్రితం కొత్త బైక్‌ను కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం గ్రామంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లి వాహనంలో పెట్రోల్‌ పోయించుకున్నాడు.

లీటర్‌ ఎంత అని బంకులో పనిచేస్తున్న వ్యక్తిని అడగ్గా, రూ.107 అని చెప్పడంతో.. ‘అడిగేవారు లేరా.. ఇంకా ఎన్ని రోజులు పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతారు’అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్‌ను బైక్‌పై పోసి నిప్పంటించి అక్కడే కూర్చున్నాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి వెంటనే మంటలు ఆర్పేశారు. విషయం తెలుసుకున్న రేవులపల్లి పోలీసులు ఆంజనేయులును, కాలిపోయిన బైక్‌ను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement