మాదాపూర్‌: చికెన్‌ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్‌ | Worms In Chicken Fry At Madhapur Restaurant | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌: చికెన్‌ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్‌

Nov 3 2024 4:08 PM | Updated on Nov 3 2024 4:18 PM

Worms In Chicken Fry At Madhapur Restaurant

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.

మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో చికెన్‌ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్‌ టవర్‌ ఎదురుగా ఉన్న హోటల్‌ నుంచి ఓ కస్టమర్‌ ఆర్డర్‌ తెప్పించుకున్నారు. పార్శిల్‌ ఓపెన్‌ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్‌ తిన్న  కస్టమర్‌ అనిరుధ్‌ జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement