ప్రాథమిక పరిశుభ్రతపై పిల్లలకు వర్క్‌ షాప్‌

Workshop For Children On Basic Hygiene Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు. సెసేమ్ వర్క్‌షాప్-ఇండియా, సెసేమ్ వర్క్‌షాప్ యొక్క భారతీయ విభాగం, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నాన్ ప్రాఫిట్ మీడియా, ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్, హైజీన్ అండ్ బిహేవియర్ చేంజ్ కోయలిషన్ (HBCC)తో కలిసి ప్రజలలో 'చేతి పరిశుభ్రత, వ్యాధుల నివారణ' గురించి అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్‌ నిర్వహించారు.

'తినే ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడగడం మర్చిపోవద్దు. పిల్లలు, కుటుంబాలలో పరిశుభ్రత జ్ఞానం, వైఖరులు, అభ్యాసాలను ప్రోత్సహించడం, అభివృద్ధి అవసరాలను తీర్చడం మా లక్ష్యం' అన్నారు.   ఈ విషయం మనందరికీ చిన్నప్పటి నుంచి నేర్పుతున్నదే ఐనప్పటికీ  కోవిడ్‌ మహమ్మారి ప్రారంభంతో, అంటు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఈ ప్రాణాలను రక్షించే అలవాటును సాధారణ జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం మరింత ముఖ్యమైందిగా మారిందని పేర్కొన్నారు.
చదవండి: జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top