
డబ్బులు డిమాండ్
జనగామ జిల్లా: అత్తా కోడళ్లు కొట్టుకున్న వివాదంలో డబ్బులు డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన అత్తాకోడళ్లు ఎదునూరి లచ్చవ్వ, ఎదునూరి మంజుల నల్లా నీటి విషయంలో ఈనెల 15న గొడవపడ్డారు.
ఈ ఘటనలో ఎదునూరి లచ్చవ్వ తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు తన చిన్న కోడలు మంజుల, కుమారుడు నాగరాజుపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో హెడ్కానిస్టేబుల్ గుగులోతు బాలోజి, కానిస్టేబుల్ నునావత్ రాజు నాగరాజుకు ఫోన్చేసి కేసు నమోదు చేయవద్దంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని నాగరాజు గ్రామానికి చెందిన వ్యక్తికి తెలుపగా.. వీరి మధ్య సంభాషణను రికార్డుచేసి... కమిషనర్కు పంపించి చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన సీపీ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలడంతో బాలోజి, రాజును సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.