మునుగోడులో ఈసీ విఫలం..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ విమర్శించారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేక రులతో మాట్లాడుతూ ఇంత పెద్దఎత్తున మునుగోడుకు డబ్బులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశామని స్పష్టం చేశారు.