
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్-2025 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు రెండు సెక్షన్స్లో పరీక్షలు జరగనున్నాయి.ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల నిర్వహణ తేదీలు, సెషన్లు, సబ్జెక్టులు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈసారి టెట్కు 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.