పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా లింగయ్య 

Telangana Perika Kula Sangam President Lingaiah - Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మిద్ది లింగయ్యను ఎన్నుకున్నట్లు ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ చించు ఊషన్న తెలిపారు. మూడేళ్ల కాలపరిమితితో కూడిన నియామక పత్రాన్ని బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లింగయ్యకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోకాపేటలో ప్రభుత్వం మంజూరు చేసిన 2 ఎకరాల స్థలం, రూ.2 కోట్లతో త్వరలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని తీర్మానించినట్లు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top